
మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
పౌరసత్వ సవరణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందిన ముస్లిమేతర మతస్తులకు ఈ బిల్లు ద్వారా పౌరసత్వం కల్పించే అవకాశం ఇచ్చారు.హిందువులు,క్రిస్టియన్లు,సిక్కులు, జైనులు,బౌద్దులు,పార్సీ వర్గాలకు చెందిన వారికి పౌర సత్వం కల్పించేందుకు ఈ సవరణ బిల్లును తీసుకువస్తున్నారు.వచ్చే వారం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
కశ్మీర్లో రద్దు చేసిన ఆర్టికల్ 370 తరహాలోనే ఈ బిల్లు కూడా ముఖ్యమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో తెలిపారు.ఎంపిక చేసిన క్యాటగిరీల్లో మాత్రమే అక్రమంగా దేశంలోకి చొరబడిన వారికి ఆశ్రయం ఇచ్చేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారు.హోం మంత్రి అమిత్ షా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ సభ్యులు అందరూ హాజరుకావాలని ఆ పార్టీ ఆదేశించింది.